ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నా సరే తెలంగాణాలో మాత్రం సాగునీటి ప్రాజెక్ట్ ల విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు. కరోనా కేసులు పెరుగుతున్నా సరే రైతులకు సాగు నీరు అందించే దిశగా అడుగులు వేస్తుంది. ఇక ఇదిలా ఉంటే అక్కడ సాగునీటి ప్రాజెక్ట్ లు పూర్తి అయిన సందర్భంగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. 

 

తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సృష్టించిన రంగనాయక సాగర్‌ జలాశయం పూర్తిగా నీటి తో నిండిపోయి ఉంది. దాని మధ్యలో ఒక కొండ ఉంది. అది చూడటానికి మహాసముద్రం మధ్యలో ఉండే ఒక ద్వీపం లా కనపడుతుంది. దీనిని ఇప్పుడు ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: