వివాదాస్పద టీడీపీ నేత కూన రవికుమార్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఇటీవల ఆయన ఒక ఎమ్మార్వో ని ఫోన్ లో బూతులు తిట్టారు. దీనితో ఆయనపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు. దీనితో కేసు నమోదు చేసిన నాటి నుంచి ఆయన కనపడకుండా పోయారు. నాలుగు రోజుల నుంచి ఆయన కనపడటం లేదు. 

 

అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉన్నారు. ఎమ్మార్వో ని ఆయన బెదిరించారు అనే ఆరోపణలు ఉన్నాయి. పొందరు పోలీస్ స్టేషన్ లో ఆయన లొంగిపోయారు. ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. గతంలో కూడా ఆయనపై అనేక వివాదాలు ఉన్నాయి. స్పీకర్ తమ్మినేని పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: