నగిరి ప్రోటోకాల్ వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. డిప్యూటి సిఎం నారాయణ స్వామి పై  ఎమ్మెల్యే ఆర్కే రోజా అధిష్టానానికి ఫిర్యాదు చేసారు. దీనితో వెంటనే కీలక పరిణామ౦ చోటు చేసుకుంది. పుత్తూరు లో కళ్యాణ మండపం నిర్మాణానికి సహకరించాలని ఎమ్మెల్యే రోజాను అంబేద్కర్ ట్రస్ట్ సభ్యులు కలిసారు. 

 

కాగా తాను డిప్యూటి సిఎం ని అని తాను ఎక్కడికి అయినా వెళ్తా అని నారాయణ స్వామి నిన్న మీడియా లో వ్యాఖ్యలు చేసారు. తనకు రోజాకు మధ్య ఏ విధమైన ఇబ్బందులు లేవు అని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారం మీడియా లో హడావుడి కావడంతో అధిష్టానం కూడా ఇద్దరికీ సూచనలు చేసింది. ఇలాంటి వ్యవహారాలు రిపీట్ కానివ్వోద్దని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: