ఒరిస్సా లో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి వేగంగా పెరుగుతున్నాయి. పదుల సంఖ్యలో కేసులు ప్రతీ రోజు కూడా నమోదు కావడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. దేశ౦ లో అతి తక్కువ కేసులు ఉన్న రాష్ట్రం నుంచి నేడు భారీగా కేసులు నమోదు అయ్యే రాష్ట్రంగా నిలిచింది. ఇక ఇప్పుడు అక్కడ పరిస్థితి ఆందోళన కరంగా మారుతుంది. 

 

నేడు 76 కొత్త పాజిటివ్ కేసులు పెరగడంతో, ఒడిశాలో మొత్తం కేసుల సంఖ్య 1,593 కు పెరిగింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 853 ఉన్నాయి. ఇప్పటి వరకు 733 రికవరీలు మరియు 7 మరణాలు సంభవించాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అక్కడ లాక్ డౌన్ ని పెంచే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: