లాక్ డౌన్ లో చాలా మంది సినీ ప్రముఖులు తమ అభిమానులకు ఏదోక రూపంలో వినోదాన్ని అందించిన సంగతి తెలిసిందే. చిరంజీవి రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇలా ప్రతీ ఒక్కరు కూడా తమ ఇంట్లో తాము చేస్తున్న పనులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులను తమదైన శైలిలో అలరించారు. దీనిపై రామ్ గోపాల్ వర్మ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసారు.
మిగతా సినీ వ్యక్తులు ఊడుస్తున్నప్పుడు, ఆహారం వండుతున్నప్పుడు బట్టలు ఉతుకుతున్నప్పుడు తాను ఒక ఫిల్మ్ చేసానని పేర్కొన్నాడు. కాగా ఆయన ఒక సినిమా ట్రైలర్ ని నిన్న విడుదల చేసారు. కరోనా అనే పేరుతో ఆ సినిమా రానుంది. దీనిపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేసారు. కరోనా ఉంటే సినిమా ఎలా చేసారని ప్రశ్నించారు.
When the rest of film people were SWEEPING FLOORS, COOKING FOOD ,WASHING UTENSILS , DRYING CLOTHES etc etc I MADE A FILM 💪💪💪 #CORONAVIRUSFILM https://t.co/fun1EdkIgX pic.twitter.com/i8ME1eyP4h
— ram gopal varma (@RGVzoomin) May 27, 2020