ఏడాది పాలన సందర్భంగా సిఎం వైఎస్ జగన్ విద్యా శాఖపై మేధోమధనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో మనను నిలబెట్టే ఆస్తి చదువు మాత్రమే అని జగన్ వ్యాఖ్యానించారు పిల్లలకు మనం ఇచ్చే మంచి ఆస్తి చదువు మాత్రమే అని జగన్ పేర్కొన్నారు. 

 

పేదోడు పోటీ ప్రపంచంలో గెలవాలి అంటే కచ్చితంగా ఇంగ్లీష్ మీడియం ఉండాలని ఆయన పేర్కొన్నారు. అందుకే తాను ఇంగ్లీష్ మీడియ౦ కోసం కష్టపడుతున్నట్టు చెప్పారు. తాను పాదయాత్రలో విద్యార్ధుల కష్టాలను చూసా అని జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రతీ ఒక్కటి ఇంగ్లీష్ మీడియ౦లోనే ఉంటుందని అయినా మన పిల్లలని కొందరు తెలుగు మీడియం లో చదివించాలి అంటున్నారని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: