పేదరిక నిర్మూలనకు ఏకైక మార్గం చదువు ఒక్కటే మార్గం అని ఏపీ సిఎం వైఎస్ జగన్ అన్నారు. డబ్బులు లేక చాలా మంది తల్లి తండ్రులు పిల్లలను చదివించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. పాదయాత్రలో పిల్లలను చదివించలేక ఇబ్బంది పడుతున్న చాలా మంది తల్లి తండ్రులను తాను కలిసా అని జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

 

గోపాల్ అత‌డి పేరు నా ముందు ఏడ్చాడని ఆ నాటి పరిస్థితులను జగన్ గుర్తు చేసుకున్నారు. పాద‌యాత్ర‌లో చేస్తుండ‌గా ఓ ఇంటి ముందు ఫ్లెక్సీ ఉందని... ఆ ఫ్లెక్సీ ఎవ‌రిది అన్న అని గోపాల్‌ను అడిగా.. అది నా కొడుకుది  అని చెప్పాడని... నా కొడుకు బాగా చ‌దువుతాడని, కాని చదువుకోలేక ఉరి వేసుకున్నాడని చెప్పినట్టు జగన్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: