విద్యా రంగంలో మార్పులు తీసుకురావడానికి తాము చాలా వరకు కృషి చేస్తున్నామని ఏపీ సిఎం వైఎస్ జగన్ అన్నారు. విద్యా రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టామని విద్యా రంగంలో మార్పుల కోసమే ఇంగ్లీష్ మీడియం ని తీసుకొచ్చామని చెప్పారు జగన్. పేదోళ్ళు పెద్ద చదువుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని సిఎం జగన్ అన్నారు. 

 

బ్రిక్స్ దేశాలతో పోలిస్తే కాలేజీలో చేరే విద్యార్ధుల సంఖ్యలో మనం చాల వెనుకబడి ఉన్నామని సిఎం జగన్ చెప్పారు. ఇంగ్లీష్ ని తీసుకొస్తే తెలుగుని అగౌరవ పరిచినట్టు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. అసెంబ్లీ లో చట్టాలు చేయకుండా అడ్డుకుంటారు కోర్ట్ ల్లో కేసులు వేస్తారని జగన్ ఈ సందర్భంగా ఆయన విపక్షాలపై మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: