మహానాడు సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో విజయవాడ, సింహాచలం, తిరుపతి ఆలయాల్లో అవినీతి ఉందని ఆయన మండిపడ్డారు. విపక్ష కార్యకర్తలపై వేలాది మందిపై కేసులు నమోదు చేసారని మండిపడ్డారు. అమరావతి నిర్మాణం పూర్తి చేసి ఉంటే ఎన్నో ఉద్యోగాలు వచ్చేవని అన్నారు. 

 

ఉమ్మడి ఏపీలో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్ లు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నిర్మించినవే అంటూ చంద్రబాబు వివరించారు. పెన్షన్ పెంచుతామని చెప్పి పేదలను మోసం చేసారని అన్నారు. గిట్టుబాటు ధర పెంచుతామని పెంచలేదంటూ మండిపడ్డారు. ఒక్క అవకాశం ఇవ్వమని అధికారంలోకి వచ్చారని మొదటి రోజే ప్రజావేదిక కూల్చి వెయ్యాలని నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. దేవాలయ ఆస్తులను అమ్మే హక్కు  ఎవరు ఇచ్చారని చంద్రబాబు నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: