రాష్ట్రంలో ఈరోజు మహానాడు జరుగుతున్న సమయంలో అధికారులు చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి కరోనా నోటీసులు జారీ చేశారు. మహానాడు జరుగుతున్న నేపథ్యంలో కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని నోటీసుల్లో సూచించారు. మంగళగిరి తహశీల్దార్ పేరిట ఈ నోటీసులు జారీ అయ్యాయి. కోవిడ్‌ నోటీసులను టీడీపీ కార్యాలయ కార్యదర్శి రమణకు ఆత్మకూరు వీఆర్వో వెంకటేశ్వర్లు అందజేశారు. 
 
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రెండు రోజుల పాటు మహానాడు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు జూమ్ వెబినార్ ద్వారా రాష్ట్రంలోని వేల మంది కార్యకర్తలు, నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం గురించి చంద్రబాబు దేశంలోనే తొలిసారిగా జరుగుతున్న డిజిటల్ రాజకీయ సమావేశం తెలుగుదేశం మహానాడు 2020 అని అన్నారు. టీడీపీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు జూమ్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని డిజిటల్ మహానాడులో పాల్గొనాలని చంద్రబాబుకు పిలుపునిచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: