లాక్ డౌన్ పై తెలంగాణా సిఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. హైదరాబాద్ లో సిటీ బస్సులు సహా మెట్రో సర్వీసులను రీ ఓపెన్ చేసే దానిపై ఆయన సాధ్యా సాద్యాలను అధికారులతో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అంతరాష్ట్ర బస్సు సర్వీసులపై ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది.

 

హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో షాపులు ఓపెన్ చేయించాలా లేదా అనే దాని మీద ఆయన తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తుంది. ఈ నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను పూర్తి స్థాయిలో ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: