విశాఖ మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కి డాక్టర్ సుధాకర్ లేఖ రాసారు. తనకు ఇచ్చే మందులపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. వాటి కారణం గా తనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని సుధాకర్ లేఖలో ఆరోపణలు చేసారు. తనకు ఏ విధమైన పరిక్షలు చేయకుండానే పోలీసులు మద్యం మత్తులో ఉన్నారని నిర్ధారించారని పేర్కొన్నారు.

 

అలాగే తనకు మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన లేఖ రాసారు. కాగా ఆయన ఇటీవల రోడ్ల మీద ఆందోళన చేయడంతో విశాఖ మెంటల్ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణ చేస్తుంది. ఇటీవల ఈ కేసుని సిబిఐ కి అప్పగిస్తూ హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: