చిత్తూరు జిల్లాలో విషాదం జరిగింది. తండ్రి మరణ వార్త విన్న ఒక కొడుకు కూడా మరణించాడు. చిత్తూరు రూరల్ మండలం నల్ల వెంకటయ్యగారి పల్లెలో తండ్రి ఆంజనేయుడు నాయుడు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోగా... అతని కొడుకు బాబు నాయుడు కి బంధువులు సమాచారం ఇచ్చారు. దీనితో తండ్రి అంత్యక్రియల కోసం  అతను బెంగళూరు నుంచి చిత్తూరుకు వెళ్ళగా పలమనేరు అంతర్ రాష్ట్ర సరిహద్దులో పోలీసులు అతనికి అనుమతులు ఇవ్వలేదు. 

 

దీంతో ఆధారాల కోసమని తండ్రి ఫోటోని కుటుంబ సభ్యులు అతనికి వాట్సప్ లో పంపించగా ఆ ఫోటోను చూసిన వెంటనే బాబు నాయుడు గుండెపోటుతో నుంచున్న చోటే కూలిపోయాడు. వెంటనే పోలీసులు అతన్ని పరీక్షించి మరణించాడు అని చెప్పారు. ఇలా ఒక్క రోజే ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం విషాదంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: