ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాలో వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీనితో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వర్గ విభేదాలతో వాళ్ళు దాడులు చేసుకున్నారు. ఆధిపత్యం నేపధ్యంలోనే ఈ గొడవలు జరిగాయి.
బి.కోడూరు మండలం పాయలకుంట గ్రామంలో సచివాలయ భూమి పూజ కార్యక్రమంలో వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ చెలరేగింది. దీనితో ఒకరిపై ఒకరు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఎనిమిది మంది కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అదుపు చేసే ప్రయత్నం చేసారు. ఇరువర్గాల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. గాయపడిన వారు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.