ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాలో వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీనితో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వర్గ విభేదాలతో వాళ్ళు దాడులు చేసుకున్నారు. ఆధిపత్యం నేపధ్యంలోనే ఈ గొడవలు జరిగాయి. 

 

బి.కోడూరు మండలం పాయలకుంట గ్రామంలో సచివాలయ భూమి పూజ కార్యక్రమంలో వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ చెలరేగింది. దీనితో ఒకరిపై ఒకరు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఎనిమిది మంది కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అదుపు చేసే ప్రయత్నం చేసారు. ఇరువర్గాల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. గాయపడిన వారు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: