IHG


బాలీవుడ్ అందాల తార అనుష్క శర్మ. క్రికెట్ క్రిడా కారుడు కోహిలిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది ఈ నటి. ప్రస్తుతం లాక్ డౌన్ కాలం నడుస్తున్నందున సినిమాలను సినిమా హాళ్లల్లో చూసే పరిస్థితి లేదు. ప్రస్తుతం వెబ్ సిరీస్ ల కాలం నడుస్తున్నందున. ప్రపంచ వ్యాప్తంగా వెబ్ సీరిస్ లు ప్రాచుర్యం పొందుతున్నాయి. తెలుగు లో కూడా లూజర్ అనే వెబ్ సిరీస్ సక్సెస్ ని సాధించింది. అయితే అనుష్క శర్మ తన సొంత నిర్మాణ సారధ్యం లో ఓ వెబ్ సిరీస్ ని రూపొందించింది.

 

అనుష్క శర్మ రూపొందించిన “పాతాళ్ లోక్” వెబ్ సిరీస్ కి ఇప్పుడు అనుకోని ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. ఈ వెబ్ సిరీస్ లో హిందువులను కించ పరచేలా సీన్స్ ఉన్నాయ్ అంటూ నెటిజన్స్ మండి పడుతున్నారు. ఈ సినిమాలో హిందువులు బీఫ్ ని తింటున్నట్లు చూపించారు ఇది హిదువుల మనో భావాలను దెబ్బతీసేలా ఉంది అని అంటున్నారు. ఈ వెబ్ సిరీస్ ను అమెజాన్ లో రిలీజ్ చేయగా ..ఈ సిరీస్ ని చుసిన అందరూ మండిపడుతున్నారు..దీనికి అనుష్క సంజాయిషీ ఇవ్వాలంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: