దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఏ మాత్రం కూడా కట్టడి అయ్యే అవకాశాలు కనపడటం లేదు. రోజు రోజుకి కరోనా తీవ్రత పెరగడమే గాని ఏ విధంగా కూడా తగ్గడం లేదు. ఇక దేశ వ్యాప్తంగా నిన్న ఒక్క రోజే 7 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. రికార్డ్ స్థాయిలో తొలిసారి 190 మంది ఒక్క రోజే కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 

 

మొత్తం కేసుల సంఖ్య 158,086 కి చేరుకుంది. 4,534 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 67,749 మంది పూర్తిగా కోలుకున్నారు. గుజరాత్ మహారాష్ట్ర లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముంబై లో నిన్న ఒక్క రోజే వెయ్యి కి పైగా కేసులు నమోదు కాగా అందులో 75 మంది పోలీసులే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: