జమ్మూ కాశ్మీర్ లో మరో పుల్వామా తరహా దాడికి ఉగ్రవాదులు ప్రయత్నాలు చేసారు. పుల్వామాలో పోలీసులు, సిఆర్‌పిఎఫ్ మరియు ఆర్మీ సకాలంలో స్పందించడంతో పేలుడు పదార్ధాలు సంభవించే వాహనాన్ని గుర్తించి వెంటనే నిర్వీర్యం చేసారు. కారుని హిజ్బుల్ కి చెందిన ఒక ఉగ్రవాది నడిపినట్టు గుర్తించారు. 

 

వెంటనే ఘటనా స్థలంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్కడ ఏ సంఘటనలు చోటు చేసుకోకుండా బలగాలు మొహరించాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని సమాచారం. ఇక ఈ సందర్భంగా భారీ ఎత్తున పేలుడు పదార్ధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఎంత మందిని బలగాలు అదుపులోకి తీసుకున్నాయి అనేది తెలియాల్సి ఉంది. అటు కేంద్ర రక్షణ శాఖ దీని గురించి ఆరా తీసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: