ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వైసీపీ నేత లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు చేసారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటాయని పేర్కొన్నారు. అదృష్టం కొద్దీ తెలుగు రాష్ట్రాలకు మంచి ముఖ్యమంత్రులు దొరికారు అని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించే వారికే ఆయన ఆశీస్సులుంటాయని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. 

 

ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటన్నారు అని అన్నారు  ఆమె.. తెలుగు వారి కష్టాలను తీర్చటానికి ఇద్దరు ముఖ్యమంత్రులు అహర్నిశలు కష్టపడున్నారని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ ఘాట్ లో ఆమె నివాళులు అర్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: