తన తండ్రి ఎన్టీఆర్ కి సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని బాలయ్య పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఆయన వివరించారు. 

 

విప్లవాత్మక పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచారని, అలాగే ఎన్టీఆర్‌ నటించిన సినిమాలు కూడా చరిత్రలో నిలిచిపోతాయని ఆయన పేర్కొన్నారు. ఆయన చేసిన సినిమాలు ఎవరూ చేయలేరు అని బాలయ్య అన్నారు. ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. తెలుగు ప్రజల ఋణం తీర్చుకోవడానికి ఎన్టీఆర్ పార్టీ స్థాపించారు అని బాలకృష్ణ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: