తెలంగాణాలో అడవి జంతువులు ఇప్పుడు హడావుడి చేస్తున్నాయి. రోజు రోజుకి పులుల సంచారం తెలంగాణాలో ఎక్కువైపోతుంది. ఇటీవల హైదరాబాద్ లో చిరుత పులి దొరకక ముందే పలు ప్రాంతాల్లో పెద్ద పులులు చిరుత పులులు కనిపించాయి. తాజాగా నల్గొండ జిల్లా రాజాపేట తండా శివారులో పొలాల్లో చిరుత పులి కనపడింది. 

 

ఇది అక్కడి రైతులు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కుకుంది. దానిని చూసిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనితో అటవీ శాఖ అధికారులు రంగం లోకి దిగి దానిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఉచ్చులో పడి కదలకుండా అలాగే ఉండటం తో గాయాలు ఏమైనా అయ్యాయా అనేది అర్ధం కావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: