గత ప్రభుత్వంలో పరిశ్రమలు పెట్టాలి అంటే వాటికి రాయితీలు ఇవ్వాలి అంటే కచ్చితంగా ప్రభుత్వ పెద్దల చేతులు తడిపే పరిస్థితి ఉండేది అని సిఎం వైఎస్ జగన్ చంద్రబాబు సర్కార్ పై విమర్శలు చేసారు. నాలుగో రోజు మేధోమధన సదస్సు సందర్భంగా ఆయన మండిపడ్డారు. 

 

ఇప్పుడు కాకపోయినా రేపు అయినా కేంద్ర౦కి మన అవసరం ఉంటుందని అప్పుడు మన డిమాండ్ లు సాధించుకుంటాం అని జగన్ అన్నారు. దేశంలోనే నాలుగో అతి పెద్ద పార్టీ మనది అని జగన్ పేర్కొన్నారు. 20 లక్షల పెట్టుబడులు 40 లక్షల ఉద్యోగాలు అని తప్పుడు మాటలు చెప్పారని జగన్ ఆరోపించారు. ప్రత్యేక హోదా కచ్చితంగా సాధించుకుంటాం అని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. గత ప్రభుత్వం చెప్పినట్టు తాను మాటలు చెప్పను అని జగన్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: