ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మన పాలన మీ సూచన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో మీడియా సమావేశం నిర్వహించి పలు సూచనలు సలహాలు సేకరించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కూడా వివరిస్తున్నారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించడంతో పాటు... గత ప్రభుత్వం ఎలాంటి అక్రమాలకు పాల్పడింది అనే విషయాలు కూడా చెబుతున్నారు. 

 


 గత ప్రభుత్వం కేవలం మాటలతోనే సరిపెట్టింది అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అభివృద్ధిని గ్రాఫిక్స్ రూపంలో చూపించి ప్రజలను మోసం చేసింది అన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉంది అంటూ చెప్పుకొచ్చిన  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తమ ప్రభుత్వం చెప్పిందే చేస్తుందని... చేసింది మాత్రమే చెబుతుంది అంటూ చెప్పుకొచ్చారు. మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడం తమ ప్రభుత్వానికి తెలియదు అన్నారు. కేవలం నిజాయితీ అనేది మాటల వరకు మాత్రమే కాదు చేతుల్లో కూడా చూపించాలి అంటూ వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: