ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పారిశ్రామికవేత్తలతో సదస్సు నిర్వహించారు. సీఎం జగన్ మాట్లాడుతూ గత ప్రభుత్వ పెద్దలందరూ, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అబద్ధాలు చెప్పడంలో దిట్టలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కియా పరిశ్రమ వెళ్లిపోతుందని ప్రచారం చేశారని.... అనంతరం ఆ ప్రచారం అబద్ధమని తేలిందని అన్నారు. కియా పరిశ్రమ ఎండీతో తాను మాట్లాడిన సమయంలో ఆయన ప్రచారం ఖండించారని... ఆయన వండర్ ఫుల్ మ్యాన్ అని జగన్ చెప్పారు.  

 

రాష్ట్రంలో 15,000 కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం ప్రైవేట్ కంపెనీలు ముందుకొస్తే వారితో కలిసి పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని సీఎం అన్నారు. హైదరాబాద్, బెంగళూరు నగరాలతో పోటీ పడే సత్తా రాష్ట్రంలో విశాఖకు మాత్రమే ఉందని సీఎం జగన్ చెప్పారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: