ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ఈరోజు 54 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 2841కు చేరుకుంది. గడచిన 24 గంటల్లో 45 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా కర్నూలులో కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 59కు చేరింది. రాష్ట్రంలో అధిక సంఖ్యలో కేసులు నమోదైన కర్నూలు జిల్లాలో ప్రభుత్వాస్పత్రి నుంచి కరోనా రోగి అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. 
 
 
ఆదోని పట్టణానికి చెందిన 64 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కాగా ఆమెను ఈ నెల 23వ తేదీన ఆదోని నుంచి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతున్న వార్డు నుంచి అదృశ్యం కావడంతో ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. పోలీసులు రంగంలోకి దిగి మహిళ కోసం కర్నూల్ బస్టాండ్ , రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: