ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మన పాలన మీ సూచనలో భాగంగా పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సదస్సులో కియా మరిన్ని పెట్టుబడుల గురించి కీలక ప్రకటన చేసింది. ఏపీలో 400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నట్టు కియా సీఈవో కూకున్ షుమ్ ప్రకటించారు. ఎస్.యూ.వీ వాహనాల తయారీపై పెట్టుబడులు పెడుతున్నట్టు కియా నుంచి ప్రకటన వెలువడింది. 
 
గతంలో ఏపీ నుంచి కియా మోటార్స్ వెళ్లిపోతున్నట్టు టీడీపీతో పాటు ఒక వర్గం మీడియా తీవ్ర ప్రచారం చేసింది. అనంతరం కియా ఆ ప్రచారాన్ని ఖండించింది. తాజాగా ఏపీలో మరో 400 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతూ కియా బాబోరి గ్యాంగ్ కు భారీ షాక్ ఇచ్చింది. కొట్టకుండానే చంద్రబాబు గ్యాంగ్ కు చెంపదెబ్బ తగిలింది. కియా మరిన్ని పెట్టుబడులు పెట్టనుండటంతో రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: