కొందరు అధికారుల తీరు వలనే పార్టీకి కార్యకర్తలు దూరం అయ్యారని మ‌హ‌నాడులో శాప్ మాజీ  చైర్మ‌న్ మోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ఒకప్పుడు తానా బాగా బ్రతికా ఆయన గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేసారు. కార్యకర్తలను చంద్రబాబు కలవకుండా అధికారులు అడ్డుకున్నారని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసారు. 

 

చంద్రబాబుకి కార్యకర్తలకు అధికారులు దూరం పెంచారని తనకు చంద్రబాబు శాప్ చైర్మన్ పదవి ఇచ్చారని ఆ తర్వాత ఇచ్చిన కొన్ని జీవోలను అధికారులు అడ్డుకున్నారని కొందరి పేర్లు చెప్పారు. సతీష్ చంద్ర, పిఎస్ శ్రీనివాస్, రాజమౌళి బాగా ఇబ్బంది పెట్టారని మోహన్ అన్నారు. తనకు ఇవ్వాల్సిన జీవోలు ఇవ్వలేదని అన్నారు. ఒకప్పుడు తాను చాలా బాగా బతికి ఇప్పుడు అప్పుల పాలయ్యా అని పేర్కొన్నారు. పాదయాత్రలో తిరిగిన వారికి పదవులు రాలేదని అన్నారు. చంద్రబాబు దగ్గరకు రాకుండా పోలీసులు లాగేసారని ఆవేదన వ్యక్త౦ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: