ఈ రోజు ఉదయం నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ టాలీవుడ్ లో కొందరు మంత్రి తలసాని శ్రీనివాస్ కలిసి భూములు పంచుకుంటున్నారు అని చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక ఈ అంశంలో తాజాగా మంత్రి తలసాని మాట్లాడుతూ క్లారిటి కూడా ఇచ్చారు. 

 

తాజాగా సినీ పెద్దలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మీడియా తో నాగార్జున మాట్లాడుతూ తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కొనియాడారు. ఎన్నో మీటింగ్ లను ఆయన ఏర్పాటు చేసారని అందుకు ధన్యవాదాలు అని అలాగే తాను కేసీఆర్ కి కూడా ధన్యవాదాలు చెప్తున్నా అని అన్నారు. ఆయన మాట్లాడుతున్న సందర్భంగా విలేఖరి బాలకృష్ణ వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా... తలసాని జోక్యం చేసుకుని నేను మాట్లాడతా దాని గురించి అని అక్కడ ఆపేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: