తమిళనాడు లో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకి అక్కడ భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. చెన్నై కోయంబేడు మార్కెట్ లో కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. చెన్నై మొత్తం ఇప్పుడు దాదాపుగా రెడ్  జోన్ గానే ఉన్న సంగతి తెలిసిందే. 

 

ఇక చెన్నై నుంచి ఇతర ప్రాంతాలకు ఇప్పుడు కరోనా వేగంగా వ్యాపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. చెన్నై నుంచి సేలం జిల్లాకు విమానంలో వెళ్ళిన ఆరుగురికి కరోనా ఉందని బయటపడింది. వారికి పరిక్షలు చేయగా కరోనా పాజిటివ్ వచ్చినట్టు వెల్లడి అయింది. దీనితో విమానంలో ఉన్న అందరికి  కరోనా పరిక్షలు చేస్తున్నారు. అయితే అక్కడ విమానాలను ఆపేసే ఆలోచనలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: