ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా కేసులు అసలు లేని స్థితి నుంచి పదుల సంఖ్యలో కేసులు నమోదు అయ్యే విధంగా వెళ్తున్నాయి. ప్రతీ రోజు కూడా పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి అక్కడ. మణిపూర్, అసోం, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. 

 

తాజాగా మణిపూర్ లో భారీగా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో, మణిపూర్‌లో 11 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి; ధృవీకరించిన మొత్తం కేసుల సంఖ్య 55 గా ఉందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక అక్కడ మరణాల సంఖ్యా చాలా తక్కువగా ఉంది. ఒకరు మాత్రమే ప్రాణాలు కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: