నల్గొండ జిల్లా రాజాపేట తండా శివారులో దొరికిన చిరుత పులి మరణించింది. హైదరాబాద్ కి తరలిస్తున్న సమయంలో అది మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోయిందని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉదయం గ్రామ శివారుల్లో అది ఒక ఉచ్చులో చిక్కుకుని ఉంది. దాన్ని బంధించడానికి వెళ్ళగా అది అటవీ శాఖ అధికారులపై దాడికి కూడా దిగింది. 

 

ఈ దాడిలో అటవీ శాఖ అధికారికి గాయాలు కూడా అయ్యాయి. ఆ తర్వాత దాన్ని బంధించడానికి గానూ ప్రత్యేక బృందాలు రాగా మత్తు మందు ఇచ్చి దాన్ని బంధించి హైదరాబాద్ జూ పార్క్ కి తరలించే ప్రయత్నం చేసారు. దారిలోనే అది ప్రాణాలు కోల్పోయిందని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. దానికి శవ పరీక్ష నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: