సిబిఐ కి కర్నూలు సుగాలి ప్రీతీ హత్య కేసుని అప్పగించింది ఏపీ సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది ఏపీ సర్కార్. మూడేళ్ళ క్రితం సుగాలి ప్రీతీ ని అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపణలు చేసారు. ఇక ఇది రాజకీయ దుమారం కూడా అప్పట్లో బాగానే రేగింది. 

 

ఇక ప్రభుత్వం  మారిన తర్వాత కూడా ఈ వ్యవహారం చల్లారలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు వెళ్లి ఆమె కుటుంబానికి అండగా నిలవడమే కాదు నిరసన యాత్ర కూడా చేసారు. ఆయన పర్యటనకు వెళ్ళే ముందే సిఎం జగన్ కేసుని సిబిఐ కి అప్పగిగిస్తూ ప్రకటన చేసారు. కాగా ఇప్పుడు సిబిఐ కి అప్పగిస్తూ జీవో నెంబర్ 56 ని జారీ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: