ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ నివాసంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన  కోడలు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఆమె మాదాపూర్‌లోని meenakshi NAIDU' target='_blank' title='మీనాక్షి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మీనాక్షి టవర్స్‌లో స్నేహితురాలి ఇంటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన వెంటనే ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. 

 

ఆమెను అక్కడ ఉన్న వారు హుటాహుటిన రాయదుర్గం ఏఐజీ ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో చేర్పించేలోపే ఆమె మరణించారు అని వైద్యులు చెప్పారు. అయితే ఆమె ఏ విధంగా మరణించారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న కన్నా గుంటూరు నుంచి హైదరాబాద్ బయల్దేరి వెళ్ళారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: