దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వేల కేసులు ప్రతీ రోజు కూడా నమోదు అవుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే చాలా రాష్ట్రాలు ఇప్పుడు జాగ్రత్తలు పడుతున్నాయి. లాక్ డౌన్ లేకపోతే ఏంటీ అనే పరిస్థితి చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక లాక్ డౌన్ ని కేంద్రం 5 వ విడత కొనసాగించే సూచనలు ఉన్నాయి. ఈ తరుణంలో 5 రాష్ట్రాలు లాక్ డౌన్ ని కోరుతున్నాయి. 

 

అందులో ప్రధానంగా తెలంగాణా, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్తాన్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాలు తమకు లాక్ డౌన్ ని కావాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇక విమాన ప్రయాణాలు కూడా వద్దు అని ఈ రాష్ట్రాలు కోరే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: