ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ విషయంలో సిఎం వైఎస్ జగన్ త్వరలోనే ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. లాక్ డౌన్ ని కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం చెయ్యాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. కరోనా కారణంగా గ్రామీణ ప్రాంతాలు బాగా ఇబ్బంది పడుతున్నాయని ఆయన అధికారులతో అంటున్నారు. 

 

అందుకే ఇక గ్రామ స్థాయిలో లాక్ డౌన్ వద్దు అని కేవలం కొన్ని పట్టణ ప్రాంతాలకు మాత్రమే దాన్ని పరిమితం చెయ్యాలి అని ఆయన భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దీనిపై ఆయన  అధికారులతో సమావేశం కూడా నిర్వహించారు. కీలక అధికారులు కూడా ఇదే అభిప్రాయాన్ని సిఎం ముందు  చెప్పినట్టు తెలుస్తుంది. నేడో రేపో దీనిపై ప్రకటన వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: