ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ జులై 7న కడప జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో జూలై 7న ఆయన పర్యటిస్తారు. ట్రిపుల్ఐటీ క్యాంపస్లో రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం తో పాటుగా రూ.90 కోట్ల వ్యయంతో నిర్మించిన ల్యాబ్కాంప్లెక్స్లను ప్రారంభిస్తారని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.
ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినా్షరెడ్డి అలాగే పాడా ఓఎస్డీ అనిల్కుమార్ రెడ్డిలు పర్యటనకు వెళ్తారు. ఇప్పటికే అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. జూలై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతిని కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైఎస్సార్ ఘాట్లో నివాళులు అర్పిస్తారు జగన్. దీనితో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.