హైకోర్ట్ తీర్పుపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ సుప్రీం కోర్ట్ కి వెళ్ళాలి అని భావిస్తుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని కొనసాగించాలి అని ఏపీ హైకోర్ట్ కాసేపటి క్రితం తీర్పు ఇచ్చింది. పూర్తి స్థాయిలో తీర్పు రాగానే ఏపీ సర్కార్ సుప్రీం కోర్ట్ లో పిటీషన్ దాఖలు చెయ్యాలని భావిస్తుంది. సీనియర్ లాయర్లతో ఏపీ సర్కార్ చర్చలు జరుపుతుంది. 

 

తీర్పు ప్రతికూలంగా వస్తుందని తాము ఊహించామని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. తీర్పు కాపీలు అందగానే సుప్రీం కోర్ట్ కి వెళ్ళాలి  అని కసరత్తులు చేస్తుంది. కాగా ఆయనను తొలగిస్తూ ఏపీ సర్కార్ ఇచ్చిన జీవోలను ఏపీ హైకోర్ట్ కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆర్డినెన్స్ తీసుకొచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: