వైద్యం కోసం పేద వాడు అప్పుల పాలు కాకూడదు అనే ఉద్దేశంతో వైఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ తీసుకొచ్చారు అని కాని గత ప్రభుత్వం ఆరోగ్య శ్రీని నీరు గార్చింది అని సిఎం జగన్ ఆరోపించారు. రూ 5 లక్షల ఆదాయ౦ ఉన్న వారికి ఆరోగ్య శ్రీ వర్తిస్తుందని ఆయన అన్నారు. వైద్య ఆరోగ్య శాఖపై జగన్ చేసిన మేధోమధనం లో ఈ వ్యాఖ్యలు చేసారు. 

 

క్యాన్సర్ రోగులకు కూడా ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది అని జగన్ పేర్కొన్నారు. రూ కోటి 42 లక్షల కుటుంబాలను ఆరోగ్య శ్రీ లో చేర్చామని జగన్ అన్నారు వైద్య ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది జగన్ అన్నారు. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ పశ్చిమ గోదావరి లో ఉందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: