ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా సిఎం వైఎస్ జగన్ వైద్య ఆరోగ్య శాఖ పై మేధోమధనం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శ్రీ పై ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. ఆరోగ్య శ్రీ ని 2 వేల రోగాలకు పైగా వర్తిస్తుంది అని జగన్ చెప్పుకొచ్చారు.
పేద వాడు ఆరోగ్య౦ కోసం అప్పులు పాలు అవ్వకూడదు అని భావించే వైఎస్ తీసుకొచ్చారని జగన్ అన్నారు. 1.42 కోట్ల మందిని చేర్చామని చెప్పుకొచ్చారు. వీరికి సూపర్ స్పెషాలిటీ హాస్పటల్లో చికిత్స అందిస్తున్నామని అన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై 132 టాప్ హాస్పటల్స్ లో కూడా అందిస్తున్నట్టు జగన్ వివరించారు. అన్ని జిల్లాల్లో కూడా దీనిని త్వరలోనే పూర్తి స్థాయిలో అమలు చేస్తామని జగన్ చెప్పారు.