ఈరోజు ఏపీ హైకోర్టు జగన్ సర్కార్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎన్నికల కమిషన్ గా నియమించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పవన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసిందని కామెంట్లు చేశారు. హైకోర్టు ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకి విశ్వాసం ఇనుమడింపజేసిందని అన్నారు. 
 
ఎక్కడా జగన్ సర్కార్ పేరు ఎత్తని పవన్ కళ్యాణ్ పరోక్షంగా తీర్పును సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశారు. పవన్ గతంలో ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ను ఆర్డినెన్స్ ద్వారా తొలగించిన సమయంలో పవన్ విమర్శలు చేశారు. తాజాగా హైకోర్టు తీర్పు జగన్ కు వ్యతిరేకంగా రావడంతో హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: