మహారాష్ట్రలో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు. అక్కడ రోజు రోజుకి కరోనా కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతూనే ఉన్నాయి. తాజాగా అక్కడ భారీగా కేసులు నమోదు అయ్యాయి.  ఇక ఇప్పటి వరకు అక్కడ దాదాపు 60 వేల మందికి కరోనా సోకింది. 

 

ఇక అక్కడి పోలీసుల్లో కూడా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 116 మంది పోలీసులకు కోరనా సోకింది. రాష్ట్ర పోలీసు శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు మొత్తం కరోనా సోకిన పోలీసుల సంఖ్య 2,211కు చేరుకోగా, ఇంతవరకూ 25 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ఆ రాష్ట్రంలో 2 వేల మంది ఇప్పటి వరకు మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: