ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గత పది రోజుల నుంచి పెరుగుతున్న కరోనా కేసులు నేడు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కేవలం 33 కేసులు మాత్రమే రాష్ట్రంలో నమోదు అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఇప్పుడు మొత్తం 2874 గా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. 

 

ఇప్పటి వరకు 60 మంది కరోనా కారణంగా మరణించారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య చూస్తే 777 గా ఉండగా ఇప్పటి వరకు పూర్తిగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2034గా ఉంది. కాగా కొత్తగా నమోదు అయిన కేసుల్లో ఆరు కోయంబేడు లింక్ లు ఉన్న కరోనా కేసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: