కరోనా వైరస్ తో ఇప్పుడు ప్రపంచం మొత్తం భయపడుతున్న సంగతి తెలిసిందే. ఎవరికి వారుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా భయంతో కన్న వారిని కూడా నమ్మలేని పరిస్థితి నెలకొంది. దేశ వ్యాప్తంగా కూడా నా ప్రాణాలే ముఖ్యం అనే విధంగా చాలా మంది వ్యవహరించడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. 

 

తాజాగా తెలంగాణాలోని కరీంనగర్ లో ఒక ఆందోళనకర సంఘటన జరిగింది. తల్లికి కరోనా ఉందని కిసాన్ నగర్ లో బయటకు నెట్టేశారు కొడుకులు. దీనితో ఆ తల్లికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అర్ధం కాక రోడ్డు మీద బట్టలతో కూర్చుని ఉంది. ఈ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. దీనిపై పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: