దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పెంపు విషయంలో ఇప్పుడు కేంద్ర హోం  మంత్రి పలు రాష్ట్రాల సిఎం లతో ఫోన్ లో మాట్లాడుతున్నారు. వారిని అడిగి వాస్తవ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన స్వయంగా ఫోన్ లు చేసారు. ఏపీ సిఎం వైఎస్ జగన్ కి కూడా ఆయన ఫోన్ చేసారు. 

 

కోవిడ్‌ తీవ్రత సహా ఏ జిల్లాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, లాక్ డౌన్ మినహాయింపులు వంటి వాటిని ఆయన వివరించారు. అలాగే కరోనా వైరస్ నివారణా చర్యలు, లాక్‌డౌన్‌పై ఇరువురి మధ్య చర్చ జరిగింది. కరోనా కట్టడికి గానూ రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను వివరించిన సిఎం కేంద్రం సహకారం కావాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: