కరోనా కష్టాలతో ఉండటమో ఏమో గాని దేశ వ్యాప్తంగా ఇప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయి. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో క్రమంగా దొంగతనాలు పెరుగుతున్నాయి. డబున్న వారి ఇళ్ళను టార్గెట్ చేస్తున్నారు కొందరు. తాజాగా ఒక ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. టీం ఇండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ ఇంట్లో దొంగతనం జరిగింది.
అవును గంభీర్ తండ్రి కారుని ఎత్తుకుపోయారు. గంభీర్ తండ్రి వినియోగించే ఎస్యూవీ కారుని దొంగతనం చేసారు. ఢిల్లీలోని రాజేంద్రనగర్లో.. ఇంటి బయట నిలిపి ఉంచిన వాహనాన్ని ఎత్తుకుపోయారు. ఈ ఘటనపై గంభీర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫూటేజ్ ని పరిశీలిస్తున్నారు అధికారులు.