హైదరాబాద్ ని వరుస అగ్ని ప్రమాదాలు ఇబ్బంది పెడుతున్నాయి. నిన్న ఒక్క రోజే రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. గత పది రోజుల్లో ఎక్కడో ఒక చోట అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీనితో ఇప్పుడు ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లోనే మరో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ లోని మియాపూర్ వద్ద ఉన్న మెట్రో స్టేషన్ వద్ద ఈ అగ్ని ప్రమాదం జరిగింది. 

 

మెట్రో స్టేషన్ పక్కన ఉన్న పూరి గుడిసెల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోనే ఉన్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: