ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సిఎం జగన్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసం నిధులు ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చెప్పారని అన్నారు. నూతనంగా ఏర్పడిన 15 వ ఆర్ధిక సంఘం రాష్ట్రానికి ఎక్కువ సహాయం చెయ్యాలని చూసిందని అన్నారు.
ఎపీకి చెందిన వాడిగా ఏపీ అభివృద్దికి ప్రయత్నం చేస్తా అని అన్నారు ఆయన. ఏపీ అభివృద్ధి కి కేంద్రం సహాయం చాలా అవసరం అని ఆయన పేర్కొన్నారు. ఏపీ అభివృద్దికి మోడీ, జగన్ కలిసి పని చేస్తున్నారని రామ్ మాధవ్ అన్నారు. ఏపీకి మంచి వనరులు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.