దేశంలో ఈ మధ్య ఎక్కడో ఒక చోట అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఏదోక ప్రాంతంలో జరుగుతున్న ఈ అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.  తాజాగా జమ్మూ కాశ్మీర్ లో ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రంలోని ఉధంపూర్ జిల్లాలోని మంతల్ ప్రాంతంలో కాశ్మీర్‌కు వెళ్లే సమయంలో ఎల్‌పిజి సిలిండర్లతో వెళుతున్న ట్రక్కుకు మంటలు చెలరేగాయి. 

 

దీనితో అక్కడ ఉన్న స్థానికులు దీనికి సంబంధించిన వీడియో ని సోషల్ మీడియా  లో పోస్ట్ చేసారు. దీనితో భారీగా వాహనాలు రహదారికి ఇరు వైపులా ఆగిపోయాయి. అగ్నిమాపక యంత్రాలు కూడా వచ్చే పరిస్థితి కనపడటం లేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: