ఒక పక్క కరోనా మరో పక్క ఆర్ధిక ఇబ్బందులు మరో పక్క కుటుంబ కలహాలు... పైకి చెప్పలేని ఒత్తిడి. దీనితో చాలా మంది ఇప్పుడు ఆత్మహత్యల దిశగా అడుగులు వేస్తున్నారు. పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కుటుంబ కలహాలతో ఇప్పుడు పలువురు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తుంది. 

 

ఈ క్రమంలోనే పిల్లలను కూడా చంపి వాళ్ళు కూడా చనిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో భార్గవి అనే ఒక మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన 10 ఏళ్ళ కొడుకుని చంపి తాను చనిపోయింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదర్ షా కోట్ పరిధిలో ఈ ఘటన జరగగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: