ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాసారు. మిడతల దండు ని తేలికగా తీసుకోవద్దు అని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ ని తేలికగా తీసుకోవడం తోనే ఈ పరిస్థితి వచ్చిందని చాలా నష్టం జరిగిందని లేఖలో ఆయన ఆరోపించారు. 

 

మిడతల దండు ప్రభావం చాలా దారుణంగా ఉంటుందని కేంద్రం హెచ్చరికలు పొరుగు రాష్ట్రాల విధానాలు పట్టించుకోకుండా ఏడాది వేడుకలు పబ్లిసిటీ కి ప్రాధాన్యత ఇస్తున్నారని ఏపీ సర్కార్ తీసుకున్న జాగ్రత్తలు కనపడటం లేదని ఆయన లేఖలో ఆరోపణలు చేసారు. కాగా తెలంగాణకు మిడతల దండు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని... ఏపీ కి దాదాపుగా లేనట్టే అని అధికారులు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: