బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా యాక్టివ్ గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. పలు విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. సినిమాలకు సంబంధించినవి  మాత్రమే కాకుండా.. పర్సనల్ లైఫ్ కి సంబంధించిన పలు విషయాలను  కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు అమితాబచ్చన్. 

 

 తాజాగా అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్విట్టర్ లో  ఒక వీడియోను పోస్ట్ చేసిన అమితాబ్ బచ్చన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీడియో లో ఒక వ్యక్తి ఒక ప్లేట్ పై  శానిటైసర్ వేసి  దానికి మంట అంటిస్తాడు  అయితే చూడడానికి అక్కడ ఎలాంటి నిప్పు  కనిపించదు. కానీ శానిటైసర్  వేసిన  దగ్గరికి పేపర్ తీసుకెళ్తే మాత్రం నిప్పు  అంటుకుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ఈ వీడియో సోషల్ మీడియాలో  పోస్ట్ చేయగా  అది వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: